ENGLISH

మమ్మల్ని బదనాం చేయొద్దు: టాలీవుడ్‌ రిక్వెస్ట్‌

14 July 2017-17:50 PM

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం మొత్తం టాలీవుడ్‌నే కుదిపేస్తోంది. ఈ ఇష్యూకి సంబంధించి, పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ పేర్లని తాము అధికారికంగా ప్రకటించలేదనీ, ఎక్జైజ్‌ శాఖ అధికారి అకున్‌ సబర్వాల్‌ ప్రకటించారు. కానీ మీడియా అత్యుత్సాహంతో సదరు సినీ ప్రముఖులు ఈ విషయమై ఇప్పటికే మీడియా ముందుకొచ్చి, తమని అనవసరంగా ఈ రొంపిలోకి లాగొద్దనీ మీడియాని వేడుకుంటున్నారు. ఈ ఇష్యూకి సంబంధించి, తమ తమ అభిప్రాయాలను తెలియపరిచారు పలువురు నటులు. నటుడు సుబ్బరాజు తనకు నోటీసు అందిందనీ, అయితే ఎందుకు తనకి ఈ నోటీసు వచ్చిందో అర్ధం కావడం లేదనీ తెలిపారు. తనీష్‌ అయితే చాలా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి సఫర్‌ అవుతున్నారనీ దయచేసి తమ పేర్లు పదే పదే పాయింట్‌ చెయ్యొద్దనీ మీడియాని రిక్వెస్ట్‌ చేశాడు. నవదీప్‌ కూడా ప్రొఫిషన్‌లో భాగంగా ఈ నేరానికి పాల్పడే వ్యక్తితో పరిచయం ఉంది, అంతేకానీ, ఆ నేరంతో తనకెలాంటి సంబంధం లేదనీ అన్నాడు. ఆయన దగ్గర నా ఫోన్‌ నెంబర్‌ ఉన్నంత మాత్రాన ఆ నేరానికి తాను పాల్పడినట్లు ఎలా నిరూపిస్తారనీ ప్రశ్నించాడు. మా అసోసియేషన్‌ కూడా ఈ విషయంపై సీరియస్‌గానే స్పందించింది. సినీ పరిశ్రమపై బురద చల్లొద్దనీ, అందుకు పాల్పడిన వారి పేర్లు మాత్రమే బయట పెట్టాలనీ చెప్పింది. అలాగే విచారణ సంస్థలు నిందితులు ఎవరో కరెక్ట్‌గా తేల్చకుండానే ఇలాంటి గాసిప్స్‌ని మీడియా ప్రచారం చేయడం మంచిది కాదనీ తెలిపింది. 

ALSO READ: డ్రగ్స్ కేసులో నోటిసులు అందుకున్న ప్రముఖులు వీరే?!