ENGLISH

నయనతార మళ్లీ హ్యాండిచ్చింది

12 January 2018-13:26 PM

తమిళ సినిమాల ప్రమోషన్స్‌కి వెళుతుంది. కానీ తెలుగు సినిమాల ప్రమోషన్స్‌కి రావడానికి అస్సలు ఇంట్రెస్ట్‌ చూపదు ముద్దుగుమ్మ నయనతార. నయనతార నటించిన 'జై సింహా' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార విషయంలో ప్రమోషన్స్‌ వివాదం ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో నయనతారకు తెలుగు సినిమా ప్రమోషన్స్‌ పట్ల చిన్న చూపున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలే కాదు. స్టార్‌ హీరోల సినిమాలకు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనదు నయనతార. అయితే ఈ సారి బాలయ్య ఎలాగైనా నయనతారను రప్పిస్తాడని అనుకున్నారంతా. కానీ బాలకృష్ణ కూడా రప్పించలేకపోయాడు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కానీ, ఆడియో ఫంక్షన్‌ ఈవెంట్‌లో కానీ ఎక్కడా నయనతార కనిపించలేదు. దీంతో ఈ సారి కూడా నయనతార హ్యాండిచ్చింది అనుకోక తప్పడం లేదు. తర్వాత నయనతార చేతిలో ఉన్న పెద్ద సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకం. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటిది ఈ సినిమా ప్రమోషన్స్‌కైనా నయనతార విచ్చేస్తుందా? అంటే ఏమో ఆమెకే తెలియాలి.

రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జై సింహా' విషయానికి వస్తే, ధియేటర్స్‌ వద్ద బాలయ్య అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. బాలయ్య సినిమాకి ఉండాల్సిన అన్ని కమర్షియల్‌ అంశాలు ఈ సినిమాలో ఉండడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగా జరగడంతో ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి.. రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో.. కాస్సేపట్లోనే తేలనుంది.

ALSO READ: 'జై సింహా' మూవీ రివ్యూ & రేటింగ్స్