ENGLISH

బాలయ్య - పూరీ ఎన్ని కథలు?

10 March 2017-13:21 PM

నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, సెప్టెంబర్‌ 29కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని పూరీ చెప్పారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ విషయంలో ఇప్పుడంతా ఆశక్తి నెలకొంది. గతంలో పూరీ జగన్నాధ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కోసం ఓ స్టోరీ ప్రిపేర్‌ చేశారు. దానికి 'ఆటో జానీ' అని టైటిల్‌ కూడా పెట్టారు. అదే కథని ఇప్పుడు బాలయ్యతో తెరకెక్కిస్తున్నాడంటూ ఓ వర్గం అంటోంది. అయితే మహేష్‌కి 'జనగణమన' టైటిల్‌తో మరో కథ వినిపించాడు. ఆ కథ, ఇప్పుడు బాలయ్యతో తెరకెక్కిస్తున్నాడంటూ మరో వర్గం వాదిస్తోంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూరీ బాలయ్య కోసమే ప్రత్యేకించి ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని ప్రిపేర్‌ చేశారు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' టైంలోనే ఆ కథని బాలయ్యకి వినిపించగా, బాలయ్య మెచ్చి, పూరీతో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు. అయితే ఏది ఏమైనా ఈ కాంబినేషన్‌ తెరపైకి వచ్చినప్పట్నుంచీ కథ విషయంలో పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే పూరీ జగన్నాధ్‌ నోరు విప్పాలి. అయితే పూరీ మాత్రం బాలయ్య సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి.. అని మాత్రమే చెబుతున్నారు. కానీ కథ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఏమో చూద్దాం. బాలయ్య వంటి స్టార్‌ హీరోతో పూరీ చేయబోయే మ్యాజిక్‌ ధమాకా ఎలా ఉండబోతోందో!

ALSO READ: నగరం మూవీ రివ్యూ & రేటింగ్స్