ENGLISH

కమెడియన్లు పంచేసుకున్నారు

03 March 2017-15:49 PM

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినీ రంగానికి నంది అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ కమెడియన్‌గా తాగుబోతు రమేష్‌కి నంది అవార్డు దక్కింది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో తాగుబోతు రమేష్‌ నటన ఆకట్టుకుంటుంది. తాగుబోతు డ్రైవర్‌గా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ కీలకమైనది. అయితే అదే సినిమాలో మరో కమెడియన్‌గా నటించిన సప్తగిరి క్యారెక్టర్‌ కూడా బాగా నవ్వులు పండించింది. అందుకే ఈ అవార్డులో తాగుబోతు రమేష్‌, తన మిత్రుడు సప్తగిరికి కూడా భాగం ఉందన్నాడు. అలాగే సప్తగిరి తన మిత్రుడైన తాగుబోతు రమేష్‌కి ఈ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు జంట కమెడియన్లు సినీమాల్లోనే కాదు, బయట కూడా చాలా మంచి స్నేహితులు. ఒకరి గొప్పతనాన్ని మరొకరు ప్రశంసించుకుంటున్నారు అందుకే. సప్తగిరి ఈ మధ్యనే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో హీరో అయ్యాడు. ఈ సినిమాతో కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే ఉత్సాహంతో సప్తగిరి హీరోగా మరో సినిమా కూడా రాబోతోంది. అదే 'రివాల్వర్‌ రాజు'. ఈ సినిమాలో తన మిత్రుడు తాగుబోతు రమేష్‌కి ఓ మంచి క్యారెక్టర్‌ ఇచ్చాడట. ఈ ఇద్దరి స్నేహం చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది కదా. ఏది ఏమైనా ఈ ఇద్దరూ కలిసి మళ్లీ మనల్ని నవ్వించడానికి త్వరలోనే మన ముందుకు రాబోతున్నారన్న మాట. ఆల్‌ ది బెస్ట్‌ టు తాగుబోతు రమేష్‌ అండ్‌ సప్తగిరి. 

 

ALSO READ: కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌ మూవీ రివ్యూ & రేటింగ్స్