ENGLISH

అప్పుడు మిల్కీబ్యూటీ ఇప్పుడు మలయాళ కుట్టీ.!

19 June 2018-07:30 AM

మెగాస్టార్‌తో కలిసి నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆ మాటకొస్తే, యాక్టింగ్‌పై ఆశక్తి, ఉండి, ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రతీ ఒక్కరికి చిరంజీవి సినిమాల్లో అరక్షణమైనా కనిపిస్తే చాలు జన్మ ధన్యమైపోతుందని భావించేవాళ్లే. అలాగే అందాల భామ అనుపమా పరమేశ్వరన్‌ కూడా కోరుకుంటోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం 'తేజ్‌ ఐలవ్‌యూ' చిత్రంలో నటిస్తోంది. 

ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. చిరంజీవి పక్కన అరక్షణం కనిపించినా చాలు నా జన్మ ధన్యమైపోతుంది అని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా కాంపౌండ్‌లోనే ఉంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ నటిస్తున్న 'తేజ్‌ ఐలవ్‌యూ'లో హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమాకు త్వరలోనే మెగాస్టార్‌ సినిమాలో కూడా ఛాన్స్‌ వస్తుందేమో చూడాలి మరి. గతంలో ఓసారి తమన్నా ఇలాగే మెగాస్టార్‌తో నటించాలన్న తన కోరిక బయటపెట్టింది. చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ద్వారా ఆ కోరిక ఇప్పుడు మిల్కీబ్యూటీకి నెరవేరబోతోంది. 

అలాగే భవిష్యత్తులో అనుపమా కోరిక కూడా నెరవేరుతుందేమో చూద్దాం. ఇకపోతే కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తేజ్‌ ఐలవ్‌యూ' జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రస్తుతానికి అంచనాలు బాగా నెలకొన్నాయి. అన్నీ కలిసొచ్చి ఈ చిత్రం హిట్‌ అయితే, అనుపమా పంట పండినట్లే. మరోవైపు యంగ్‌ హీరో రామ్‌తో 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలోనూ అనుపమా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

 

ALSO READ: విజయ్ కి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయ్..!