ENGLISH

దర్శకుడు బాలచందర్ ఆస్తులు వేలం.. ఆందోళనలో అభిమానులు..!

14 February 2018-17:13 PM

ప్రముఖ దర్శకుడు బాలచందర్ కి సంబంధించిన ఇంటిని బ్యాంక్ వారు వేలం వేస్తున్నారు అనే వార్త ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే, 2010లో బాలచందర్ సొంత సంస్థ అయిన కవితాలయ ద్వారా ఒక టీవీ సీరియల్ నిర్మించడానికి తమ కార్యాలయాన్ని, ఇంటిని ఒక ప్రముఖ బ్యాంకు లో తాకట్టు పెట్టారు. అయితే ఆ సీరియల్ ని రద్దు చేసి దానిని డిజిటల్ చేసే పనిలో నిమగ్నమయ్యారట.

అయితే ఈ సమయంలోబ్యాంక్ కి చెల్లించవలసిన చెల్లింపులు జరగకపోవడంతో వారు బాలచందర్ ఇంటిని వేలం వేస్తాము అని నోటిసులు అందచేశారు. దీనితో బాలచందర్ కూతురు వెంటనే స్పందించి, బ్యాంక్ వారితో మాట్లాడి చెల్లింపుల గురించి ఒక నిర్ణయం తీసుకుని ఈ వేలంపాట జరగకుండా చూస్తాము అని తెలియచేసింది.

ఏదేమైనప్పటికీ ఇటువంటి వార్త బయటకి రావడంతో ఆయన అభిమానులు కలత చెందుతున్నారు.

ALSO READ: ఇది నా లవ్ స్టొరీ మూవీ రివ్యూ రేటింగ్స్