ENGLISH

బెల్లంకొండతో పూజా - ఫస్ట్‌లుక్‌ దీపావళికే

17 October 2017-20:31 PM

బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్దే జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'సాక్ష్యం' అనే టైటిల్‌ని ఈ సినిమాకి అనుకుంటున్నారనీ తెలుస్తోంది. శ్రీవాస్‌ గతంలో గోపీచంద్‌తో 'లక్ష్యం', సౌఖ్యం' సినిమాలు చేశాడు. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాకి 'సాక్ష్యం' అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాగా బెల్లంకొండ ఇటీవలే 'జయ జానకీ నాయకా' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. 'అల్లుడు శీను', స్పీడున్నోడు' సినిమాలతో హీరోగా తన సత్తా చాటుకున్నాడు బెల్లంకొండ. ముచ్చటగా మూడో సినిమా 'జయ జానకీ నాయకా'తో హిట్‌ అందుకున్నాడు. ఇక నాలుగో సినిమాగా వస్తోన్న ఈ తాజా సినిమాతో మరోసారి హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇమేజ్‌తో సంబంధం లేకుండా స్టార్‌ డైరెక్టర్స్‌, స్టార్‌ హీరోయిన్స్‌తో నటించడం బెల్లంకొండ స్పెషాలిటీ. తొలి సినిమాకే సమంతతో జత కట్టాడు. ఇక 'జయ జానకీ నాయకా' కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దిగొచ్చింది. కాగా ఇప్పుడు కొత్త సినిమాలో ముద్దుగుమ్మ పూజా హెగ్దే నటిస్తోంది. 'ముకుందా' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే అల్లు అర్జున్‌తో 'డీజె' సినిమాలో నటించి, అదరగొట్టేసింది. 'డీజె'లో అమ్మడి హాట్‌ హాట్‌ అందాలకు కుర్రకారు దాసోహం అయిపోయింది. అన్నట్లు ఈ సినిమా పూజా హెగ్దేకి తెలుగులో నాలుగో సినిమా. 'ముకుందా', ఒక లైలా కోసం', డీజె' తర్వాత చేస్తున్న సినిమా ఇది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కీ ఈ సినిమా నాలుగో సినిమా కావడం విశేషం. మరి ఈ ఇద్దరికీ నాలుగో సినిమాగా తెరకెక్కుతోన్న 'సాక్ష్యం' ( వర్కింగ్‌ టైటిల్‌ ) ఎలా వర్కవుటవుతుందో చూడాలి మరి.

ALSO READ: వర్మతో స్క్రీన్‌ప్లే రాయిస్తున్న స్వర్గీయ ఎన్టీఆర్‌!