ENGLISH

డ్రగ్స్‌ కేసులో పూరికి మద్దతిస్తున్నారు

20 July 2017-18:05 PM

స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, ఆయనకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. నిజానిజాలేంటో విచారణలో తెలుస్తాయి గనుక, అప్పటిదాకా పూరి జగన్నాథ్‌పై అభాండాలు వేయడం తగదని సినీ నటులు ప్రకాష్‌ రాజ్‌, వరుణ్‌ తేజ తదితరులంటున్నారు. ప్రకాష్‌రాజ్‌ చాలా సినిమాలు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేశారు. వ్యక్తిత్వం పరంగా పూరి చాలా గొప్ప వ్యక్తి అని అన్నారు ప్రకాష్‌రాజ్‌. పూరితో తనకు వ్యకితంగా కూడా చాలా అనుబంధం ఉందనీ, ఆయనకు డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉండి ఉండదని అభిప్రాయపడ్డారాయన. మీడియా ఈ విషయంలో కొంత సంయమనం పాటిస్తే బావుంటుందని కూడా ప్రకాష్‌రాజ్‌ చెప్పారు. ఇంకో వైపున యువ హీరో వరుణ్‌తేజ కూడా పూరి జగన్నాథ్‌తో అనుబంధం గురించి చెప్పుకున్నారు. 'లోఫర్‌' సినిమా కోసం పూరి, వరుణ్‌ కలిసి పనిచేశారు. పూరి జగన్నాథ్‌, సెట్‌లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారనీ అలాంటి వ్యక్తి మాదక ద్రవ్యాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించాడు వరుణ్‌ తేజ. నిజం నిలకడమీద తెలుస్తుందని ఈలోగా పూరి జగన్నాథ్‌పైనగానీ ఇతరులపైనగానీ అభాండాలు మోపడం సబబు కాదని, అసత్యాలు ప్రచారం చేస్తే కుటుంబ సభ్యులు మానసికంగా ఆవేదనకు గురవుతారని వరుణ్‌ అన్నాడు.

ALSO READ: శ్యాం కె నాయుడు విచారణ ముగిసింది