ENGLISH

తమిళ హీరోకి కోర్టులో చుక్కెదురు!

18 July 2017-11:10 AM

తమిళ హీరో శరత్ కుమార్ కి మద్రాసు హైకోర్టులో చుక్కెదురయింది.

వివరాల్లోకి వెళితే, శరత్ కుమార్ ఆయన సతీమణి అయిన రాధిక సంయుక్తంగా నిరవహిస్తున్న మ్యాజిక్ ఫ్రేమ్స్ నిర్మాణ సంస్థ ఒక చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుండి రూ 1.5 కోట్లని అప్పుగా తీసుకున్నారు, దీనికి గాను ఆయనకీ సంబందించిన రెండు ఆస్తులని తనఖా పెట్టారు.

అయితే ఆ చిత్రం విడుదల చేసే ముందే తమకి తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని రాడియన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని అతిక్రమించి చిత్రాన్ని విడుదల చేసారంటూ అలానే తమకి తనఖా పెట్టిన ఆస్తులని ఆమ్మడానికి యత్నించారు అంటూ ఆయన పై ఆ సంస్థ కోర్టులో కేసు వేసింది.

ఈ కేసుని స్వీకరించిన కోర్టు శరత్ కుమార్  రూ 2 లక్షల జరిమానా విదించింది.

 

ALSO READ: సినీ ప్రముఖులు సిట్ విచారణకు హాజరయ్యే తేదీలు!