ENGLISH

మహేష్ కత్తి పైన దాడి చేసింది ఎవరు?

19 January 2018-12:49 PM

సినీ విమర్శకుడు కత్తి మహేష్ పైన నిన్న రాత్రి హైదరాబాద్ లో దాడి జరిగింది.

ఆ దాడి వివరాలు ఇవే- మహేష్ కత్తి  నిన్న రాత్రి క్యాబ్ లో ప్రయాణిస్తుండగా శిల్పారామం దగ్గరిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో కత్తి మహేష్ పైన దాడి చేశారు. డ్రైవర్ వైపు ఉన్న అద్దం కిందకి దించుతుండగా ఒక్కసారిగా వారు గుడ్లతో ఆయన పైన దాడి చేసినట్టుగా అయన తెలిపారు.

ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన దాడిగానే మహేష్ కత్తి అభిప్రాయపడుతుండడం అలాగే దీనికి సంబంధించి పోలీసులని ఆశ్రయించి కేసు పెడతాను అని కూడా చెప్పడం జరిగింది. ఇదిలావుండగా ఈ దాడికి నిరసనగా ఉస్మానియా విద్యార్ధి జేఏసి తరపున ఈరోజు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు దహనం చేయాలనీ పిలుపునివ్వటం జరిగింది.

ఈ దాడి తరువాత ఒక్కసారిగి ఈ అంశం కొత్త మలుపు తిరిగినట్టయింది. అలాగే మహేష్ కత్తి కూడా ఈ సంఘటనకి కచ్చితంగా పవన్ కళ్యాణ్   భాధ్యత వహించి తనకి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆయన డిమాండ్ చేశాడు.

అయితే ఇది మహేష్ కత్తి తనకి తానే ఈ దాడిని ప్లాన్ చేసుకుని పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు చేస్తున్నాడు అంటూ పవన్ అభిమానులు సైతం ఎదురు దాడికి దిగితున్నారు.

 

ALSO READ: పోర్న్‌ స్టార్‌ అయితే తప్పేంటి?