ENGLISH

'ఒక్కడు మిగిలాడు' సెకండ్ లుక్ విడుదల

19 May 2017-18:55 PM

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం "ఒక్కడు మిగిలాడు". అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదివరకు విడుదలైన ప్రభాకరన్ గా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన రాగా.. రేపు (మే 20) మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో మంచు మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్ ను విడుదల చేశారు. మిలిటెంట్ లీడర్ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మంచు మనోజ్ స్టూడెంట్ లుక్ కోసం దాదాపు 15 కేజీలు తగ్గడం విశేషం.   

సెకండ్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "ఎల్.టి.టి.ఐ కమాండర్ గా మంచు మనోజ్ లుక్ కు ఇప్పటికీ విశేషమైన రీతిలో ఆదరణ లభిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రంలో మనోజ్ సెకండ్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశాం. పాత్ర కోసం ఆయన పడిన శ్రమ స్క్రీన్ పై కనిపిస్తుంది. కేవలం నెలల వ్యవధిలో 15 కేజీల బరువు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. పాత్ర పండించడానికి మనోజ్ పడే ప్రయాస ఏంటో అదే చెబుతుంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకొన్నాయి. జూన్ మొదటివారంలో ఆడియోను విడుదల చేసి.. నెలాఖరుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అన్నారు.
 

ALSO READ: కేశవ మూవీ రివ్యూ & రేటింగ్స్