ENGLISH

మళ్ళీ మొదలుపెట్టనున్న విష్ణు

14 September 2017-08:32 AM

"ఆచారి అమెరికా యాత్ర" షూటింగ్ లో భాగంగా తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తుండగా.. బైక్ స్కిడ్ అవ్వడంతో జరిగిన యాక్సిడెంట్ లో చిత్ర కథానాయకుడు మంచు విష్ణు, కథానాయకి ప్రగ్యా జైస్వాల్ గాయాలపాలైన విషయం తెలిసిందే. ప్రగ్యా చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోగా.. మంచు విష్ణుకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ కారణంగా మలేసియాలో మొదలైన సెకండ్ షెడ్యూల్ అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఆ యాక్సిడెంట్ కారణంగా అయిన గాయాల నుండి ధృడ నిశ్చయంతో చాలా త్వరగా రీకవరీ అయిన మంచు విష్ణు మళ్ళీ షూటింగ్ మొదలెట్టాడు. జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి-కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "చాలా సీరియస్ యాక్సిడెంట్ లో తగిలిన గాయాలను సైతం లెక్క చేయకుండా మంచు విష్ణు చాలా త్వరగా రీకవర్ అయ్యారు. అందుకే త్వరగా షూటింగ్ రీస్టార్ట్ చేయగలిగాం. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నాం" అన్నారు.

ALSO READ: రాహుల్ గాంధీ కి చురక వేసిన ప్రముఖ నటుడు!