ENGLISH

నాగచైతన్య వచ్చేదెప్పుడంటే..!

19 February 2018-15:04 PM

ఈ ఏడాది ప్రధమార్ధం టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఏదో ఒకటీ అరా సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు పోజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకోలేకపోయాయి. 'అజ్ఞాతవాసి' తదితర భారీ అంచనాల సినిమాలు కూడా నిరాశ పరిచాయి. దాంతో అందరి దృష్టీ ఇప్పుడు ద్వితీయార్ధం పైనే ఉంది. అంటే సమ్మర్‌ రిలీజ్‌ సినిమాల పైనే. 

అందుకే ఈ సమ్మర్‌కి సినిమాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలు రేస్‌కి సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు కొంతమంది యంగ్‌ హీరోలు కూడా రెడీ అవుతున్నారు. వీరిలో రామ్‌చరణ్‌ 'రంగస్థలం' మార్చి 30న విడుదలవుతుండగా, ఏప్రిల్‌ 27న మహేష్‌ 'భరత్‌ అను నేను', అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాలు విడుదల కానున్నాయి. తాజాగా ఆ రేస్‌లోకి అక్కినేని బుల్లోడు నాగచైతన్య కూడా వచ్చి చేరాడనీ సమాచారమ్‌. 

నాగ చైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం సమ్మర్‌కి విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. 'ప్రేమమ్‌' సినిమాతో సక్సెస్‌ అందుకున్న డైరెక్టర్‌ చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరికీ 'ప్రేమమ్‌' మంచి విజయాన్ని అందించింది. అదే కాంబినేషన్‌ అంటే ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్‌ నటి భూమిక కీలక పాత్ర పోషిస్తుండగా, తమిళ హీరో మాధవన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. 

ఈ సినిమాని ఏప్రిల్‌ 24న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఒకవేళ అదే జరిగితే, అందరికంటే ముందే చైతూ రేస్‌కి సిద్ధమవుతన్నట్లే భావించాలి.

ALSO READ: భానుమతి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క