ENGLISH

బుల్లి తెర పై పవన్ కళ్యాణ్ భార్య

22 September 2017-15:53 PM

ఈ మధ్య సినీ తారలు బుల్లి తెరపై కనిపించటానికి చాలా ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే, ఎన్టీఆర్ 'బిగ్ బాస్', రానా 'నెం.1 యారి' షో లకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు.

ఇప్పుడు 'బిగ్ బాస్' షో చివరి దశకు చేరుకుంది. దీని స్థానంలో కొత్తగా ఒక డాన్స్ షో ప్రారంభం అవుతుందని మనకు తెలిసింది. ఈ షో కి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ వ్యాఖ్యాతగా చేస్తున్నట్లు మనకి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

అభిమానులు చెప్పిన శుభాకాంక్షలకు ధన్యవాధాలు. 'నీతోనే డాన్స్' షో కు న్యాయ నిర్ణేతగా కొత్త ప్రయాణం మొదలైంది. సెప్టెంబర్ 30 న కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఈ షో చాలా కొత్తగా ఉందంటూ, సెట్ లో జరిగిన కొత్త ఫోటోను అభిమానులకి షేర్ చేసింది.

ALSO READ: వెండితెరపై ముగ్గురు బుల్లితెర భామల హల్‌చల్‌