ENGLISH

అఖిల్‌ బ్యూటీ మళ్లీ వస్తోంది

19 June 2018-11:25 AM

'అఖిల్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సాయేషా సైగల్‌. తొలి సినిమాకే ఘోర పరాజయం చవి చూడడంతో ఈ ముద్దుగుమ్మని ఎవ్వరూ పట్టించుకోలేదు. మరో అవకాశం కూడా ఇవ్వలేదు. దాంతో ఈ బ్యూటీ తెలుగులో మరెక్కడా కనిపించకుండా పోయింది. 

అయితే తమిళంలో మాత్రం బాగానే సినిమాలు చేస్తోంది. చేతి నిండా సినిమాలతో అక్కడ మంచి పేరే తెచ్చుకుంది. కార్తి హీరోగా తెరకెక్కుతోన్న 'కడైకుట్టి సింగం' సినిమాలో కార్తీకి జోడీగా నటిస్తోంది ప్రస్తుతం సాయేషా సైగల్‌. ఈ సినిమాని తెలుగులో 'చినబాబు' పేరుతో విడుదల చేస్తున్నారు. కార్తికి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. అనువాద చిత్రాలతోనే కాకుండా, స్ట్రెయిట్‌ తెలుగు సినిమా 'ఊపిరి'తోనూ సత్తా చాటాడు కార్తి. 

తాజాగా రాబోతున్న 'చినబాబు' సినిమాతో ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోందన్న మాట. ఒకవేళ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటే, అమ్మడికి తెలుగులోనూ ఆఫర్స్‌ వచ్చేందుకు ఛాన్స్‌ లేకపోలేదు. తమిళంలో ఎంత బిజీగా ఉన్నా, తెలుగులో వరుస సినిమాలు చేయాలనేదే సాయేషా సైగల్‌ కోరిక. కానీ అదృష్టం కలిసి రావాలి కదా. కార్తి రూపంలో ఆ అవకాశం మళ్లీ ఇన్నాళ్లకు సాయేషాకు దక్కిందనుకోవాలి. మంచి యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్న ఈ ముద్దుగుమ్మ డాన్సుల్లోనూ టాపరే. తొలి సినిమాకే ఆ విషయం ప్రూవ్‌ చేసుకుంది. 

అయితే ఎంత టాలెంట్‌ ఉన్నా, టైం కలిసి రాకపోతే, అంతే కదా. మన క్యూట్‌ బ్యూటీ సాయేషాకి టైం ఎప్పుడు కలిసొస్తుందో చూడాలిక.

 

ALSO READ: అనసూయని విచారించిన ఇంటర్ పోల్?!