ENGLISH

వెండితెరపై ముగ్గురు బుల్లితెర భామల హల్‌చల్‌

22 September 2017-15:41 PM

బుల్లితెరపై హాట్‌ హాట్‌గా హొయలొలికించే యాంకర్స్‌ అనసూయ, రేష్మి, శ్రీముఖి. ఈ ముగ్గురూ బుల్లితెరను ఏలుతున్న హాటెస్ట్‌ యాంకర్స్‌. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు ఈ ముగ్గురు హాట్‌ బ్యూటీస్‌. రేష్మి వరుసగా సినిమాలు చేసింది. హారర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్లుగా వచ్చిన వరుస చిత్రాల్లో రేష్మి నటించి, హాట్‌ హాట్‌గా తన అందాల విందు చేసేసింది. 'గుంటూరు టాకీస్‌' సినిమాతో సెన్సేషన్‌ అయిపోయింది. అయితే తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకుని మళ్లీ బుల్లితెరపై బిజీ అయ్యింది. అలాగే అనసూయ కూడా వరుస సినిమాలతో బిజీగా గడిపింది. 'క్షణం', సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలతో పాపులర్‌ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖి గతంలోనూ పలు చిత్రాల్లో నటించింది. నాని 'జెంటిల్‌మెన్‌' సినిమాతో ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ముగ్గురు భామలు సినిమాల్లో బిజీ అయిపోయారు. ఎట్‌ ఏ టైమ్‌ ఈ ముగ్గురూ తమ తమ సినిమాలతో సెట్స్‌లో బిజీగా గడుపుతున్నారు. అనసూయ 'సచ్చిందిరా గొర్రె' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. డిఫరెంట్‌ మూవీ సరికొత్త పాత్ర పోషిస్తోంది అనసూయ ఈ సినిమాలో. రేష్మి 'నెక్స్ట్‌ నువ్వే' అనే సస్పెన్స్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ వచ్చింది. సరికొత్తగా ఉంది. ఆది హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఇక 'శ్రీముఖి' కూడా ఓ కొత్తరకం కాన్సెప్ట్‌ మూవీలోనే నటిస్తోంది. 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇలా మూడు విభిన్న తరహా చిత్రాలతో ఈ 'బుల్లి' బ్యూటీలు వెండితెరపై సందడి చేస్తున్నారు.

ALSO READ: కెవ్వుకేక పుట్టిస్తోన్న సమంత