ENGLISH

సన్నీలియోన్‌ని ఏడిపించిన 'ఆమె' కథ

26 May 2018-17:56 PM

బాలీవుడ్‌లో సన్నీలియోన్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్‌ అసలు పేరైన 'కరణ్‌జీత్‌' టైటిల్‌తోనే ఈ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా కంప్లీట్‌ అయ్యింది. ఈ సందర్భంగా సన్నీలియోన్‌ సినిమా చూసిందట. సినిమా చూసిన తర్వాత తన ఫీలింగ్‌ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది సన్నీలియోన్‌. 

ఫస్ట్‌ ఫస్ట్‌ తన బయోపిక్‌ని చూసి ఏడుపొచ్చేసిందట. నా జీవితం ఏంటో నాకు తెలుసు. కానీ అవన్నీ తెరపై చూసుకుంటే చాలా బాధగా అనిపించింది. ఇలాంటి పరిస్థితులు ఫేస్‌ చేసింది నేనేనా? అని సన్నీ బాధపడిందట. కానీ ఆ సంఘటనలే ఈ రోజు తనను ఇంత బలంగా మార్చాయి అని ఆమె చెబుతోంది. పద్నాలుగేళ్ల వయసులోనే లవ్‌ ఫెయిల్యూర్‌. ఆ తర్వాత అడల్డ్‌ మూవీస్‌లోకి ఎంట్రీ. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు. 

బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఎదురైన వ్యతిరేక పరిస్థితులు ఇవన్నీ దాటి ఇప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నందుకు గర్వంగా ఉంది అని సన్నీ చెబుతోంది. అవును నిజమే, సన్నీలియోన్‌ జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు. ఎన్నో అవాంతరాలు. వాటన్నింటినీ తట్టుకుని ప్రపంచ స్థాయిలో గ్లామర్‌ తారగా గుర్తింపు తెచ్చుకుంది. సన్నీని అంతగా ఏడిపించిన ఆమె బయోపిక్‌ ఆడియన్స్‌ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి మరి. 

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో నటిగా ఎదిగి, ఇప్పుడు దక్షిణాదిన కూడా అడుగు పెట్టింది. దక్షిణాదిలో సన్నీ తొలిసారి పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటిస్తోంది 'వీరమహాదేవి' సినిమాతో. ఇదో పీరియాడిక్‌ మూవీ. ఇంతవరకూ గెస్ట్‌ రోల్స్‌, ఐటెం సాంగ్స్‌తో సౌత్‌ ఆడియన్స్‌ని పలకరించిన సన్నీలియోన్‌ 'వీర మహాదేవి' సినిమాతో ఎలా ఆకట్టుకోనుందో చూడాలిక.

ALSO READ: ఫ్లాప్‌ అని తేల్చేసిన నాని