ENGLISH

రెండో విక్రమార్కుడు - అక్కడా? ఇక్కడా?

19 May 2017-19:00 PM

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన 'విక్రమార్కుడు' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అందుకే 'విక్రమార్కుడు' సీక్వెల్‌కి సంబంధించి అక్షయ్‌కుమార్‌, రచయిత విజయేంద్రప్రసాద్‌పై ఒత్తిడి పెంచుతున్నాడట. తెలుగులో 'విక్రమార్కుడు' సినిమా రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించింది. రవితేజకు కెరీర్‌ బెస్ట్‌ మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్నే హిందీలోకి 'విక్రమ్‌ రాథోడ్‌' పేరుతో అక్షయ్‌కుమార్‌ రీమేక్‌ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అందుకే దానికి సీక్వెల్‌ చేయాలని ఎప్పటినుంచో అక్షయ్‌కుమార్‌ అనుకుంటున్నాడు. కానీ రీమేక్‌కి కథ కుదరలేదు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్‌పై ఒత్తిడి పెంచాడట అక్షయ్‌కుమార్‌. దాంతో విజయేంద్రప్రసాద్‌ కూడా సీక్వెల్‌ రాయాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారమ్‌. 'బాహుబలి' తర్వాత ఏ పెద్ద సినిమా రూపొందినా అది ఇండియన్‌ సినిమాగా ఉండాలనే ఆలోచనలొస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌ కూడా 'విక్రమ్‌ రాథోడ్‌' సీక్వెల్‌ని పెద్ద స్థాయిలో నిర్మించాలని అనుకుంటున్నాడట. ఇంకో వైపున 'విక్రమార్కుడు' సీక్వెల్‌ కోసం రవితేజ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాకి సీక్వెల్‌ తెలుగులోనా? హిందీలోనా? అనేది తెలియ రావడం లేదు. ఏదేమనా ఎక్కడొచ్చినా విజయేంద్ర ప్రసాద్‌ కథతో ఎక్కడైనా సెన్సేషన్‌ కావడం పక్కా. 

ALSO READ: 'ఒక్కడు మిగిలాడు' సెకండ్ లుక్ విడుదల