ENGLISH

టీజర్ టాక్ : 'ఉప్పెన' లాంటి రాత్రి

13 January 2021-18:14 PM

ఉప్పెన సినిమాపై ఆసక్తి పెరగడానికి రెండు కారణాలు. ఒకటి సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సినిమా కావడం. రెండు.. ఇంకో మెగాహీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌ హీరోగా రావడం. ఈ రెండు కాకుండా దేవిశ్రీ ప్రసాద్ కూడా ఓ ఎసెట్ గా నిలిచాడు. 'నీకళ్ళు నీలి సముద్రం' అంటూ విడుదలైన ఓ పాట ఉప్పెనపై అమాంతం ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. చాలా ప్రామెసింగా సాగింది టీజర్.

 

''దేవుడే వరాలిస్తాడని నాకర్ధమైయింది. ఎవరికీ పుట్టామో అందరికీ తెలుస్తుంది. ఎవరికోసం పుట్టామో నా సిన్నప్పుడే తెలిసిపోయింది'' అనే డైలాగ్ తో మొదలై టీజర్ మంచి ఫీల్ ని క్యారీ చేసింది. ''ఆగి సూసిందనుకో ..అవునోకాదో తెల్చేస్తాది. అవునంటదని సెప్పలెం.. కాదంటే మళ్ళా సూడలెం.. అందుకే సూడనీకుండా పేమించేస్తార్రా'' ఈ డైలాగ్ హీరో, హీరోయిన్ మధ్య లవ్ కెమిస్ట్రీని తెలియజేస్తుంది. ''మన ఇద్దరి మధ్య ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేసా'' అని డైలాగ్ వినడానికి కొత్తగా వుంది.

 

ఫైనల్ గా హీరోయిన్ చెప్పిన డైలాగ్ ''ఈ ఒక్క రాత్రి యనబై ఏళ్ళు గుర్తుండిపోయేలా బ్రతికేద్దాం వాసు'' కధలోని మలుపుని తెలియజేస్తుంది. ఈ డైలాగ్ తర్వాత హీరో సముద్రం ఒడ్డున చేతనంగా పడివుండటం చూపించారు. మొత్తానికి ఈ రాత్రి ఉప్పెనలో కీలకం కాబోతుందని టీజర్ కట్ లో చెప్పారు. టీజర్ బావుంది. దేవిశ్రీ మళ్ళీ ''నీ కళ్ళు' పాట ఆర్ఆర్ నే ఈ టీజర్ కీ వాడారు. విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర. అయితే టీజర్ లో కేవలం ప్రేమ జంట పైనే ఫోకస్ చేశారు. చాలా రోజుల నుంచి నేటివిటీ నేపధ్యం ప్రేమ కధ రాలేదు. దర్శకుడు బుచ్చిబాబు మొదటి సినిమాతోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు. సుకుమార్ కలం కూడా అందుకు తోడైయింది.మరి ఈ ప్రేమ కధ వెండితెర పై ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ALSO READ: రేణు దేశాయ్‌ మీదనే ఇన్ని గాసిప్స్ ఎందుకంట?