ENGLISH

మ‌హేష్ బాబు త‌గ్గాడు.. ఇక బ‌న్నీ హ్యాపీ!

19 October 2019-14:30 PM

జ‌న‌వ‌రి 12న ఏకంగా రెండు సినిమాలు ఢీ కొట్ట‌డానికి చూశాయి. అటు మ‌హేష్ బాబు `స‌రి లేరు నీకెవ్వ‌రు`, ఇటు అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` రెండూ జ‌న‌వ‌రి 12నే విడుద‌ల తేదీ ప్ర‌క‌టించాయి. రెండు సినిమాలు ఒకేసారి విడుద‌లైతే ఫ్యాన్స్‌కి హ్యాపీనే. కాక‌పోతే క‌ల‌క్ష‌న్లు పంచుకోవాల్సివ‌స్తుంది. సోలో విడుద‌ల‌కు ఉన్న ఎడ్వాంటేజ్ వీటికి ఉండ‌దు. దాంతో ఎవ‌రో ఒక‌రు రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో అటు బ‌న్నీ త‌గ్గుతాడా, ఇటు మ‌హేష్ త‌గ్గుతాడా? అన్న‌ట్టు ఎదురుచూశారు.

 

అయితే ఇప్పుడు మ‌హేష్ సినిమానే విడుద‌ల తేదీ మార్చుకోవాల‌ని డిసైడ్ అయ్యింద‌ని స‌మాచారం. `స‌రిలేరు నీకెవ్వ‌రు` జ‌న‌వ‌రి 12న కాకుండా 11న విడుద‌ల అవుతోంది. అప్పుడు అటు మ‌హేష్‌కీ ఇటు బ‌న్నీకీ సోలో రిలీజ్‌లు దొరికిన‌ట్టు అవుతుంది. దాంతో ఇరు నిర్మాత‌లూ హ్యాపీనే. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ సినిమా విడుద‌ల తేదీ మార్పుపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

ALSO READ: తెనాలి రామకృష్ణ' పక్కా నవ్వుల 'ఎక్స్‌ప్రెస్‌'!