ENGLISH

'ఎవ‌రు'... రెండోరోజూ త‌గ్గ‌ని జోరు.

17 August 2019-16:00 PM

థ్రిల్ల‌ర్ చిత్రాల‌కంటూ ఓ ప్ర‌త్యేక ప్రేక్ష‌క వ‌ర్గం ఎప్పుడూ ఉంటుంది. సినిమా బాగుంద‌న్న మాట వినిపిస్తే చాలు.. థియేట‌ర్ల‌కు రావ‌డానికి సిద్ధంగాఉంటారు. హీరో ఎవ‌రు? బ‌డ్జెట్ ఎంత‌? అనే లెక్క‌లేం వేసుకోరు. మ‌ల్టీప్లెక్స్ లో అయితే... ఇలాంటి సినిమాల‌కు మ‌రింత ఆద‌ర‌ణ ఉంటుంది. `ఎవ‌రు`కీ అలాంటి ఆద‌ర‌ణే అభిస్తోంది. అడ‌విశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లు వ‌హించిన 'ఎవ‌రు' ఆగ‌స్టు 15న విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది.

 

తొలి రోజు 1.65 కోట్లు వ‌సూలు చేసింది. శేష్ కి ఇదే రికార్డు. రెండో రోజు కూడా ఈ సినిమా జోరు త‌గ్గ‌లేదు. 1.2 కోట్ల షేర్ ద‌క్కించుకుని స్ట‌డీగా సాగుతోంది. అంటే.. తొలి రెండు రోజుల్లో 2.85 కోట్లు వ‌చ్చేశాయ‌న్న‌మాట‌. శ‌ని, ఆదివారాలూ.... ఈ సినిమాకి మంచి వ‌సూళ్లే ల‌భించే అవకాశాలున్నాయి.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.7 కోట్ల‌కుపైగానే బిజినెస్ జ‌రిగింది. తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. హాలీవుడ్ చిత్రం 'అన్ విజుబుల్ గెస్ట్‌' అనే చిత్రానికి రీమేక్ ఇది. ఇదే క‌థ‌ని బాలీవుడ్‌లో `బ‌ద్లా` పేరుతో రీమేక్ చేశారు.

ALSO READ: ఎవరు మూవీ రివ్యూ & రేటింగ్!