ENGLISH

ఎఫ్ 2కి అరుదైన గౌర‌వం

21 October 2020-14:33 PM

వెంకటేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్రం `ఎఫ్ 2`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు ఎఫ్ 3కి రంగం సిద్ధం అవుతోంది. అయితే.. ఇప్పుడీ చిత్రానికి ఓ అరుదైన గౌర‌వం ల‌భించింది. 2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది.

 

ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్‌ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. ఈ పుర‌స్కారం ల‌భించ‌డం ప‌ట్ల చిత్ర‌బృందం సంతోషం వ్య‌క్తం చేసింది. స్వ‌చ్ఛ‌మైన వినోదానికి ద‌క్కిన గౌర‌వం అని... అనిల్ రావిపూడి త‌న సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ALSO READ: 60 రూపాయ‌ల 18 పైస‌ల‌కే 'న‌ర్త‌న‌శాల‌'