ENGLISH

వ‌ర్మ సినిమాకి బ్రేక్ వేసిన హైకోర్టు.

24 November 2020-17:32 PM

వ‌ర్మ తాజా చిత్రం `దిశ‌` విడుద‌ల‌కు మ‌రోసారి బ్రేక్ ప‌డింది. హైద‌రాబాద్‌లో దిశ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇష్యూపై వ‌ర్మ తీసిన సినిమానే `దిశ‌`. ఈ సినిమా విడుద‌ల‌ను ఆపేయాల‌ని.. దిశ కుటుంబ స‌భ్యులు కోర్టుకెక్కిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు ఎన్‌కౌంట‌ర్‌కి గురైన వ్య‌క్తుల కుటుంబ స‌భ్యులు సైతం న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈనెల 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు మ‌రోసారి ఈ సినిమా విడుద‌ల‌కు బ్రేక్ వేసింది. తాజాగా ఈ సినిమా విషయంలో వ‌ర్మకు హై కోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది.

 

ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కోర్టుకు తెలిపాడు పిటీషనర్ తరపు న్యాయవాది కృష్ణా మూర్తి. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వాళ్లను ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కృష్ణ మూర్తి ఆరోపించాడు. ఈ చిత్రంలో వాళ్లను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపాడు కృష్ణ మూర్తి. చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని న్యాయ‌వాది కోరాడు. దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు సినిమాలు ఎలా తీస్తారని న్యాయ‌వాది ప్ర‌శ్నిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండా వెంట‌నే ఆదేశాలు ఇవ్వాలని పిటిషినర్ తరఫు న్యాయవాది కోరాడు. ఈ క్రమంలోనే సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు షో కాజు నోటీసులు జారీ చేసింది హై కోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ALSO READ: అప్పుడు చ‌ర‌ణ్‌తో.. ఇప్పుడు చిరుతో