ENGLISH

ఈసారి ఇద్ద‌రూ కొత్త‌మ్మాయిలే!

24 February 2021-09:15 AM

మాస్ రాజా.. ర‌వితేజ సినిమా అంటే మినిమం ఓ స్టార్ హీరోయిన్ అయినా ఉండాలి. ఒక్కోసారి ఆయ‌న ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తుంటారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌లకు చోటుంది. ఆ ఇద్ద‌రినీ కొత్త‌వాళ్ల‌నే ఎంచుకున్నార్ట‌. త‌మిళ న‌టి ఐశ్వ‌ర్య‌మీన‌న్ ని ఓ క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. మ‌రో నాయిక‌గా.. శ్రీ‌లీలాని తీసుకున్నారు.

 

ఐశ్వ‌ర్య ఇది వ‌ర‌కు కొన్ని త‌మిళ సినిమాల్లో న‌టించింది. శ్రీ‌లీలా అయితే.. `పెళ్లి సంద‌డి` సీక్వెల్ లో న‌టిస్తోంది. ఆసినిమాలోని శ్రీ‌లీలా ర‌షెష్ చూసి ర‌వితేజ సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం `ఖిలాడీ` సినిమాతో బిజీ గా ఉన్నాడు ర‌వితేజ‌. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే న‌క్కిన త్రినాథ‌రావు సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈ సినిమాలో ర‌వితేజ బిజినెస్‌మేన్ గా న‌టించ‌బోతున్నాడ‌ట‌.

ALSO READ: 'ట‌క్ జ‌గ‌దీష్' టీజ‌ర్ విడుద‌ల‌