ENGLISH

బండెక్కిన ప‌వ‌న్‌.. షూటింగ్ షురూ!

26 January 2021-13:00 PM

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఇటీవలె `వకీల్ సాబ్` సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప‌వ‌న్‌.. క్రిష్ సినిమా షూటింగ్ నీ మొద‌టెట్టారు. ఇప్పుడు `అయ్యప్పనుమ్ కోషియం` రీమేక్ ప‌నిలో ప‌డిపోయారు. సోమ‌వారం నుంచి... ఈ రీమేక్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు... ఓ చిన్న టీజ‌ర్ ని రెడీ చేశారు. షూటింగ్ వాతావ‌ర‌ణాన్ని చూపిస్తూ.. ప‌వ‌న్ బండెక్కిన వెళ్లిపోతున్న దృశ్యాన్ని ఓ చిన్న టీజింగ్ టీజ‌ర్ గా విడుద‌ల చేశారు.

 

సెట్లో ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ క‌బుర్లు చెప్పుకోవ‌డం.. మ‌రింత ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జ‌రుగుతోంది. తొలిరోజే ప‌వ‌న్ సెట్ కి వ‌చ్చారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాట‌లు... త్రివిక్ర‌మ్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. రానా మ‌రో క‌థానాయ‌కుడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ALSO READ: ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ప‌ద్మ‌విభూష‌ణ్‌