ENGLISH

ఆ ఇద్దరూ 'రంగస్థలం' మీద పడ్డారేంటీ.?

17 July 2018-18:55 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన 'రంగస్థలం' సినిమా అందరికీ నచ్చిన సంగతి తెలిసిందే. వీరూ వారూ అనే తేడా లేకుండా, ఒక్కటైన నెగిటివ్‌ ఇంపాక్ట్‌ లేకుండా అందరి ప్రశంసలు అందుకుందీ సినిమా. ప్రశంసలతో పాటు, తిరుగులేని సక్సెస్‌నీ, ఊహించని భారీ వసూళ్లని సాధించింది. సినిమా విడుదలై 100 రోజులు దాటినా ఈ సినిమా ఇంపాక్ట్‌ ఏదో మూల నుండి కనిపిస్తూనే ఉంది. 

ఇకపోతే తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాలో కీలక పాత్ర పోషించిన రాంకీ నోట కూడా 'రంగస్థలం' మాట వినిపించడం విశేషం. ఆయన రీసెంట్‌గా చూసిన సినిమాల్లో 'రంగస్థలం' సినిమా చాలా బాగుందట. చాలా బాగా తీశారా సినిమాని. చరణ్‌ నటన చాలా బాగుంది. అవకాశం వస్తే, చరణ్‌తో నటించాలని ఉందని రాంకీ అన్నారు. 

రాంకీ ఒక్కరే కాదు, ఆయన సతీమణి, అలనాటి నటీమణి అయిన నిరోషా కూడా ఇదే మాట చెప్పడం మరో విశేషం. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నిరోషా మధ్యలో చాలా కాలం సినిమాల నుండి గ్యాప్‌ తీసుకుంది. ఈ మధ్యనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. ఆమె కూడా భర్త రాంకీలానే, చరణ్‌తో నటించాలన్న తన మనసులోని కోరికను బయట పెట్టింది. 

ఈ మధ్య సీనియర్‌ హీరోయిన్లు నదియా, మీనా, వాణీ విశ్వనాధ్‌ తదితరులు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి మంచి పాత్రలు దక్కించుకుంటున్నారు. అలాగే నిరోషా కూడా మంచి పాత్రలొస్తే నటించడానికి రెడీగా ఉన్నానంటోంది. మరోవైపు బుల్లితెరపై పలు సీరియల్స్‌తోనూ నిరోషా బిజీగా గడుపుతోంది.

ALSO READ: సిద్ధార్థ్ పైన ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!