ENGLISH

సునీల్‌ ఆ మాట నిలబెట్టుకుంటాడా?

13 September 2017-18:21 PM

కమెడియన్‌గా పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో తనదైన స్టైల్‌ ప్రదర్శించాడు భీమవరం బుల్లోడు సునీల్‌. కానీ హీరో అయ్యాక, కమెడియన్‌గా ఛాన్సుల్ని వదిలేసుకున్నాడు సునీల్‌. అయితే హీరోగా వచ్చిన సక్సెస్‌లు ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. దాంతో తిరిగి కమెడియన్‌గా చేస్తాడేమోనని చాలామంది అడిగారు. స్నేహితుడు త్రివిక్రమ్‌ కోసం 'ఖలేజా'లో కామెడీ చేసిన సునీల్‌, మళ్ళీ కామెడీ వైపు చూడలేదు. మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని కావడంతో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో సునీల్‌కి ఛాన్స్‌ దక్కినా, అందులోనూ చేయలేకపోయాడు. అప్పటికి డేట్స్‌ సెట్‌ కాక ఆ మెగా ఛాన్స్‌ని వదులుకోవాల్సి వచ్చింది సునీల్‌కి. అయితే ఇప్పుడు మాత్రం ఇకపై కమెడియన్‌గానూ సినిమాలు చేస్తానని అంటున్నాడు సునీల్‌. మళ్ళీ తనను కమెడియన్‌గా చూసే అవకాశముందని ప్రేక్షకులకు, అభిమానులకు భరోసా ఇచ్చాడు. ఈ మాటలు ఇంతకు ముందూ చెప్పిన సునీల్‌, మాట నిలబెట్టుకుంటాడా? ఏమో చూడాలి మరి. ప్రస్తుతం సునీల్‌ హీరోగా 'ఉంగరాల రాంబాబు' సినిమా తెరకెక్కుతోంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మియా జార్జ్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో సునీల్‌ నవ్వులు పంచడానికి రెడీ అవుతున్నాడు. క్రాంతి మాధవ్‌ డైరెక్షన్‌ అంటే ప్యూర్‌ కామెడీ అండ్‌ హార్ట్‌ టచ్చింగ్‌ స్టోరీస్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. సునీల్‌లాంటి హీరోతో హెల్దీ అండ్‌ డిఫరెంట్‌ కామెడీని చూపించబోతున్నాడట డైరెక్టర్‌. ఈ శుక్రవారం 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ALSO READ: నటుడు చిన్నా ఇంట్లో విషాదం