తేజ ఎప్పుడూ అంతే. ఏం చేసినా షాకింగ్గా చేస్తాడు. చిత్రంతో చిన్న సినిమాలకు ఊపిరి పోసి, కొత్త క్రేజ్ తీసుకొచ్చిన దర్శకుడు తేజ. దర్శకుడిగా ఎన్ని సంచలన విజయాలు సాధించినా, ఎప్పుడూ స్టార్ హీరోల జోలికి పోలేదు. కొత్త వాళ్లతోనే ప్రయోగాలు చేశాడు. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా `'నేనే రాజు నేనే మంత్రిసతో నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. రానా, గోపీచంద్తో చెరో సినిమా తీయాలని ఫిక్సయ్యాడు. ఈరోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలకు సంబంధించిన టైటిళ్లు ప్రకటించేశాడు తేజ.
నేనే రాజు నేనే మంత్రి తరవాత రానా తో మరోసారి పనిచేయబోతున్నాడు తేజ. ఈ చిత్రానికి 'రాక్షసరాజు రావణాసురుడు' అనే పేరు నిర్ణయించారు. మరోవైపు గోపీచంద్ కోసం ఓ కథ రెడీ చేశాడు. ఈ సినిమాకి 'అలివేలు - వేంకటరమణ' అనే పేరు ఫిక్స్ చేశారు. ఈ రెండు టైటిళ్లనీ తేజ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా పట్టాలెక్కుతుంతో తెలీదు. అటు రానా, ఇటు గోపీచంద్ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ఎవరు ముందుగా ఖాళీ అయితే వారితో సినిమా సెట్స్పైకి వెళ్తుంది.
ALSO READ: రంగమ్మత్తకు మరో సూపర్ ఆఫర్?