ENGLISH

ఆచార్య‌లో మిస్ అయ్యింది.. లూసీఫ‌ర్‌లో కుదురుతుందా?

25 February 2021-10:30 AM

`ఆచార్య‌` ముగిసిన వెంట‌నే చిరంజీవి `లూసీఫ‌ర్‌` రీమేక్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు మొద‌ల‌య్యాయి. అవి ఓ కొలిక్కి వ‌చ్చేస్తున్నాయి కూడా. ఈలోగా ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక‌లో ప‌డింది చిత్ర‌బృందం.

 

ముఖ్యంగా క‌థానాయిక కోసం చాలా రోజుల నుంచి ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నాయి. ఆ స్థానం త్రిష‌కి ద‌క్కింద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. `స్టాలిన్‌`లో చిరు - త్రిష జంట‌గా న‌టించారు. ఆచార్య‌లో కూడా ముందు త్రిష‌నే తీసుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల త్రిష త‌ప్పుకుంది. ఆ స్థానంలో.. కాజ‌ల్ వ‌చ్చి చేరింది. ఈ సినిమా వ‌దులుకుంటున్నందుకు చాలా బాధ‌గా ఉంద‌ని, అయితే త్వ‌ర‌లోనే చిరుతో క‌లిసి న‌టిస్తాన‌ని అప్పుడే చెప్పేసింది త్రిష‌. ఎట్ట‌కేల‌కు ఆ అవ‌కాశం మ‌ళ్లీ లూసీఫ‌ర్ రీమేక్ తో వ‌చ్చిన‌ట్టైంది.

 

ఈసారి త్రిష - చిరు కాంబో ప‌క్కా అని.. త్రిష కూడా లూసీఫ‌ర్‌కి డేట్లు ఇచ్చేసింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది.

ALSO READ: Trisha Latest Photoshoot