ENGLISH

బాలీవుడ్‌ భామకి ఫిక్సయిన ‘బాక్సర్‌’.?

22 February 2020-15:05 PM

మెగా రాకుమారుడు వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘బాక్సర్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్న విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. అయితే, తాజాగా ఓ బాలీవుడ్‌ భామ పేరు తెరపైకి వచ్చింది. ‘దబాంగ్‌ 3’తో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని కిర్రాకెత్తించిన నయా భామ సయీ మంజ్రేకర్‌, వరుణ్‌ తేజ్‌తో జోడీ కట్టేందుకు టాలీవుడ్‌కి వస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌ పక్కన సరిజోడీగా ఈ భామ టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నారు. అధికారిక ప్రకటన ఏమీ రాలేదు కానీ, కొత్తగా తెర పైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యింది.

 

ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, అప్పుడు పూజా హెగ్దేని టాలీవుడ్‌కి పరిచయం చేసినట్లుగా ఇప్పుడు సయీ మంజ్రేకర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసిన ఘనత వరుణ్‌ తేజ్‌కి దక్కుతుంది. అంతేకాదు, హీరోయిన్స్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడంలో వరుణ్‌ ట్రాక్‌ రికార్డు కూడా పెద్దదే అని చెప్పాలి. పూజా హెగ్దేతో పాటు, ప్రగ్యా జైశ్వాల్‌, దిశా పటానీ తదితర ముద్దుగుమ్మల్ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది వరుణ్‌ తేజ్‌నే కదా. అయితే, పూజ దక్కించుకున్న స్టార్‌డవ్‌ు మిగిలిన భామలు దక్కించుకోలేకపోయారు. చూడాలి మరి, తాజా ప్రచారం నిజమైతే, ఈ నయా బాలీవుడ్‌ భామకైనా ఆ కళ ఉందేమో.

ALSO READ: 'భీష్మ‌' మూవీ రివ్యూ & రేటింగ్!