ENGLISH

మ్యుజీషియన్‌గా మారిన విజయ్‌సేతుపతి!

15 June 2019-19:00 PM

మూస క్యారెక్టర్లు కాకుండా, విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటోన్న ఈ జనరేషన్‌ హీరో విజయ్‌సేతుపతి. విలక్షణ పాత్రలన్నీ ఈయన కోసమే పుట్టకొస్తున్నాయా.? అనేంతలా మనోడి కోసం క్యారెక్టర్లు డిజైన్‌ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. హీరో, విలన్‌ ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా ఇలా చాలా రకాల పాత్రలు ఇప్పటికే పోషించేశాడు మనోడు. ఇప్పుడు కొత్తగా మ్యుజీషియన్‌ అవతారమెత్తబోతున్నాడు. ఈ సినిమాకి టైటిల్‌ సస్పెన్స్‌గా ఉంచారట ఎందుకో. 'విస్‌ఎపీ 33' అని ఆయన చేసిన సినిమాల కౌంట్‌తో ఈ సినిమాని ప్రచారం చేస్తున్నారు. వెంకట్‌కృష్ణ రోహంత్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమలాపాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి అమలాపాల్‌, విజయ్‌సేతుపతి జోడీ కడుతున్న చిత్రమిది.

 

సినిమాలో చాలా కీలక అంశాల్ని ప్రస్థావించారట. వాటిలో కొన్ని కీలక అంతర్జాతీయ అంశాలున్నాయనీ చిత్రయూనిట్‌ చెబుతోంది. సినిమా కథ విషయానికి వస్తే, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ తరహాలో కొన్ని పండుగలు, వాటి ప్రాధాన్యతతో పాటు, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించారట. సంగీతం మెయిన్‌ ఎలిమెంట్‌ అనీ తెలుస్తోంది. ఈ సినిమాలో అమలాపాల్‌తో పాటు ఓ విదేశీ భామ సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోందట. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, విజయ్‌సేతుపతి చేతిలో ఇప్పటికే చేయాల్సిన చాలా ప్రాజెక్టులున్నాయి. చాలా వరకూ అవన్నీ సెట్స్‌ మీదే ఉన్నాయి కూడా. తెలుగులోనే రెండు సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. రెండూ మెగా కాంపౌండ్‌కి సంబంధించిన సినిమాలే కావడం విశేషం. 'సైరా'లో విజయ్‌సేతుపతి యోధుడి పాత్రలో కీలక భూమిక పోషిస్తున్నాడు. వైష్ణవ్‌తేజ్‌ సినిమాలో ఓ స్టిన్నింగ్‌ రోల్‌లో విజయ్‌ సేతుపతి కనిపించనున్నాడనీ సమాచారమ్‌.

ALSO READ: గేమ్ ఓవర్ మూవీ రివ్యూ రేటింగ్