ENGLISH

కోర్టుకెక్కిన 'ఆచార్య‌' గొడ‌వ‌

04 September 2020-17:30 PM

ఆచార్య వివాదం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌లేద‌నే అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ క‌థ నాదే అంటూ రాజేష్ అనే ఔత్సాహిక ద‌ర్శ‌కుడు మీడియా ముందుకొచ్చాడు. దాంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండ్రోజులు మీడియా అంతా ఇదే హాట్ టాపిక్‌. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సివ‌చ్చింది. `ఇంకా గొడ‌వ చేస్తే.. కోర్టుకి వెళ్లాల్సివ‌స్తుంది` అంటూ హెచ్చ‌రించారు కూడా.

 

ఇప్పుడు అంత వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. కొర‌టాల శివ.. రాజేష్ పై ప‌రువు న‌ష్ట దావా వేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని టాక్‌. ఓ కుట్ర ప్ర‌కారం.. త‌న‌ని వివాదంలో నెట్టాల‌ని చూశార‌ని ఆయ‌న రాజేష్ పై కేసు ఫైల్ చేయ‌బోతున్నార్ట‌. మ‌రోవైపు రాజేష్ కూడా `నా క‌థ‌ని కాజేశారు` అంటూ..కొంత‌మందిపై 420 కేసు వేయ‌డానికి లాయ‌ర్ల‌ని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. అందుకు త‌గిన ఆధారాల్ని రాజేష్ సిద్ధం చేసుకుంటున్న‌ట్టు టాక్‌. ఈ వ్య‌వ‌హారాన్ని రాజీ కుద‌ర్చాల‌ని కొంత‌మంది సినీ పెద్ద‌లు ప్ర‌య‌త్నించారు. కానీ.. స‌ర్దుబాటు కావ‌డం లేదు. ఇప్పుడు కోర్టులో అయినా దీనికి ప‌రిష్కారం దొరుకుతుందేమో చూడాలి.

ALSO READ: రెండు సినిమాలు... ఒకే సీక్వెల్‌!