ENGLISH

మొన్న సుధీర్‌... ఇప్పుడు ర‌ష్మి

23 October 2020-17:54 PM

జ‌బ‌ర్ ద‌స్త్ టీమ్ ని `క‌రోనా` క‌ల‌వ‌ర‌పెడుతోంది. జ‌బ‌ర్ ద‌స్త్ స్టార్ సుడిగాలి సుధీర్‌కి క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుధీర్ హోం క్వారెంటైన్‌లో ఉన్నాడు. ఇప్పుడు ర‌ష్మికి సైతం కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ర‌ష్మి స్వ‌యంగా వెల్ల‌డించింది. త‌న‌లో స్వ‌ల్ప కోవిడ్ ల‌క్ష‌ణాలుంటే ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, ఇప్పుడు హోం క్వారెంటైన్ లోకి వెళ్లిపోయాన‌ని ర‌ష్మి స్ప‌ష్టం చేసింది. ఈనెల 28 వ‌ర‌కూ షూటింగులు బంద్ చేసుకున్నాన‌ని ప్ర‌క‌టించింది.

 

ఇటీవ‌ల ఈటీవీ ద‌స‌రా స్పెష‌ల్ కోసం యాంక‌ర్లంతా ఓ కార్య‌క్ర‌మం చేశారు. ఆ త‌ర‌వాతే... సుధీర్ లో క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. త‌ర‌వాత సుధీర్ కు క‌రోనా అని తేలింది. దాంతో ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వాళ్లంతా క‌రోనా టెస్టులు చేయించుకున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా ర‌ష్మి కోవిడ్ టెస్టులు చేయించుక‌డంతో క‌రోనా విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు మ‌రింత మంది జ‌బ‌ర్‌ద‌స్త్ స‌భ్యులు కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్న‌ట్టు స‌మాచారం.