ENGLISH

పానిండియా ప్రాజెక్ట్స్ తో చైతు సత్తా చాటేనా

21 June 2024-15:41 PM

అక్కినేని నాగ చైతన్య వరస పానిండియా సినిమాలు చేస్తూ, సత్తా చాటాలనుకుంటున్నాడు.ఈ  క్రమంలోనే అన్నీ పానిండియా ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం చైతు, చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం మేకోవర్ మొత్తం మార్చుకున్నాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాపై చైతు భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తండేల్ తరవాత నాగ చైతన్య కార్తీక్ దండు డైరెక్షన్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. 


విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టి ప్రత్యేక గుర్తింపు  తెచుకున్నాడు కార్తీక్ దండు. చైతుని దృష్టిలో పెట్టుకుని అద్భుత మైన కథ రాసుకున్నాడట. ఈ మూవీలో చైతు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది అని టాక్. ఇది కూడా పానిండియా సినిమాగా రోపొందుతోంది. నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా, పానిండియా సినిమాలతో దూసుకుపోతుంటే , చైతు ఇంకా టాలీవుడ్ లో ఉన్నాడు. ఈ మధ్యే 'దూత' వెబ్ సిరీస్ తో అన్ని భాషలవారికి దగ్గరయ్యాడు. లాల్ సింగ్ చద్దా లాంటి డిజాస్టర్ తరవాత దూత చైతూని నిలబెట్టింది. దూత తో వచ్చిన గుర్తింపుతో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెడుతున్నాడు.            


కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు కావటంతో సుకుమార్ సజెషన్స్, ఇన్వాల్వ్ మెంట్ తో ఈ సినిమా కూడా హిట్ గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు చైతు ఫాన్స్. తండేల్ పూర్తి అయిన వెంటనే  కార్తీక్, చైతన్య కాంబో మూవీ మొదలవుతుందని సమాచారం. నాగ చైతన్య కెరియర్లో 24వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా లాంగ్ గ్యాప్ తరవాత తెలుగు సినిమాలో కనిపిస్తోంది.