ENGLISH

హాలీవుడ్ హీరోని పెళ్లాడిన చెర్రీ హీరోయిన్

26 August 2024-15:40 PM

అమీ జాక్స‌న్ గురించి పెద్దగా ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. నటించినవి తక్కువ సినిమాలే అయినా అమ్మడికి క్రేజ్ ఎక్కువే. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కొన్నిట్లో వర్క్ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. లండన్ వాస్తవ్యురాలైన అమీ మొదట కోలీవుడ్ లో ఎంట్రీ  ఇచ్చింది. తరవాత తెలుగులో రామ్ చరణ్ నటించిన 'ఎవ‌డు' లో నటించింది. నెక్స్ట్ ఐ, 2.ఓ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలో అనుకున్న స్థాయిలో కెరియర్ కొనసాగకపోవటంతో మళ్ళీ స్వదేశానికి చెక్కేసింది ఈ బ్యూటీ. జార్జ్ ప‌నియోట్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. పెళ్లి కాకుండానే ఒక బాబుకి జన్మనిచ్చింది. 


తరవాత ఏమయ్యిందో ఏమో వీరిద్దరూ బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయారు. ఇప్పుడు హాలీవుడ్‌ నటుడు 'ఎడ్‌ వెస్ట్‌విక్' ని పెళ్లి చేసుకుంది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు  వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇట‌లీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్న ఈ జంట ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వెడ్డింగ్‌ పిక్స్‌ ను అమీ జాక్సన్‌ పోస్ట్‌ చేస్తూ ‘న్యూ జర్నీ ఇప్పుడే మొదలైంది’ అంటూ కాప్షన్ పెట్టింది.


గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న అమీ పెళ్లితో కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి. ఈ ఏడాది 'మిష‌న్ చాప్ట‌ర్ వ‌న్' అనే త‌మిళ సినిమాతో జ‌న‌వ‌రిలో సందడి చేసిన అమీ విజయాన్ని అందుకోలేక పోయింది. అలాగే హిందీలో నటించిన 'క్రాక్' కూడా నిరాశే మిగిల్చింది. మళ్ళీ ఇండియన్ సినిమాల్లో నటిస్తుందా? లేదా భ‌ర్త రిఫరెన్స్ తో హాలీవుడ్ లో బిజీ అవుతుందా అన్నది చూడాలి.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ed Westwick (@edwestwick)