ENGLISH

గుణ‌శేఖ‌ర్ హీరోయిన్ మారిందా?

29 December 2020-13:00 PM

`రుద్ర‌మ దేవి` త‌ర‌వాత `హిర‌ణ్య క‌శ్య‌ప‌` పై దృష్టి పెట్టాడు గుణ‌శేఖ‌ర్‌. ఆ సినిమా స్క్రిప్టు వ‌ర్కు కూడా దాదాపుగా పూర్త‌య్యింది. అయితే.. రానా రాక ఆల‌స్యం అవ్వ‌డంతో, ఇప్పుడు `శా‌కుంత‌లం‌` ని రూపొందిస్తున్నాడు. మ‌హాభార‌తంలోని ఆదిప‌ర్యంలో దృశ్యంతుడు - శ‌కుంత‌ల ప్ర‌ణ‌య‌గాథ ఉంటుంది. మ‌హా భార‌తంలో అదో రొమాంటిక్ చాప్ట‌ర్. దాన్ని వెండి తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు గుణ‌శేఖ‌ర్‌. అయితే... శ‌కుంతల పాత్ర పోషించేది ఎవ‌రు? అనేది ఇంత వ‌ర‌కూ చెప్ప‌నే లేదు.

 

ఆ పాత్ర లో అనుష్క క‌నిపించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `రుద్ర‌మదేవి` లో అనుష్క‌నే క‌థానాయిక‌. ఆ సినిమా గుణ‌శేఖ‌ర్ ని భారీ న‌ష్టాల్లో ముంచేసింది. అందుకే... ఇప్పుడు అనుష్క గుణ‌శేఖ‌ర్ కోసం ఉచితంగా ఓ సినిమా చేసి పెడుతోంద‌ని ప్ర‌చారం. అయితే... శ‌కుంత‌ల‌గా క‌నిపించేది అనుష్క కాద‌ని, పూజా హెగ్డే అని మ‌రో టాక్ మొద‌లైంది. అనుష్క బాగా బొద్దుగా ఉంద‌ని, శ‌కుంత‌ల పాత్ర‌కు నాజూకైన క‌థానాయిక కావాల‌ని, అందుకే అనుష్క స్థానంలో పూజాని ఎంచుకోబోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం. మ‌రి.. శ‌కుంత‌ల ఎవ‌రో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: వీకెండ్ అద‌ర‌గొట్టిన సాయితేజ్‌!