ENGLISH

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మాస్ మహారాజా ర‌వితేజ‌ 'క్రాక్'.

11 November 2020-16:21 PM

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్‌' షూటింగ్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్త‌యింది. త్వ‌ర‌లో హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఆ పాట‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్లే. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ క‌థ‌కు కీల‌క‌మైన ఓ పాత్ర‌ను పోషిస్తున్నారు.

 

ఈ చిత్రంలో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకొనే అంశాలు ఉన్నాయి. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. 'మెర్సాల్‌', 'బిగిల్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ALSO READ: Shruti Hassan Latest Photoshoot