ENGLISH

ఎన్టీఆర్ క‌థే... నితిన్ చేస్తున్నాడా?

01 April 2021-18:38 PM

స్టార్ రైట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వక్కంతం వంశీ. `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా`తో డైరెక్ట‌ర్ గానూ మారాడు. దాంతో ద‌ర్శ‌కుడిగా త‌న అవ‌కాశాల‌కు తానే పుల్ స్టాప్ పెట్టుకున్న‌ట్టైంది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడో అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు టాక్‌. నితిన్ - వ‌క్కంతంతో ప‌నిచేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని, త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌న్న టాక్స్ వినిపిస్తున్నాయి.

 

ప్ర‌స్తుతం యువ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి మొగ్గు చూపిస్తున్నాడు నితిన్‌. వాళ్ల హిట్‌, ఫ్లాప్స్ ట్రాక్ రికార్డు ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌థ న‌చ్చితే చాలు.. ఓకే అనేస్తున్నాడు. పైగా చేతిలో సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. నితిన్ తో సినిమాలు చేయ‌డానికి చాలా మంది ప్రొడ్యూస‌ర్లు రెడీగా ఉన్నారు. అందుకే వ‌క్కంతంకీ ధైర్యంగా మాటిచ్చేశాడ‌ని తెలుస్తోంది. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ కోసం ఓ క‌థ రెడీ చేసుకున్నాడు వ‌క్కంతం. ఇప్పుడు అదే క‌థ‌ని అటూ ఇటూగా మార్చి నితిన్ తో చేసేస్తున్నాడ‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

ALSO READ: ఆ సూప‌ర్ హిట్ కి సీక్వెల్ ఉందా? లేదా?