ENGLISH

‘నాగేశ్వరరావు’ ఇక లేనట్లేనా ?

08 February 2023-10:00 AM

విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ మరోసారి చేతులు కలిపారు. ‘గీత గోవిందం’ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సర్కారు వారి పాట తర్వాత పరశురాం చేస్తున్న సినిమా ఇది. విజయ్ ఖుషి పూర్తవ్వగానే సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్తారు. ఇదీలావుంచితే.. నాగచైతన్యతో పరశురాం చేయాల్సిన సినిమా పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న.

 

సర్కారు వారి పాటకు ముందే నాగచైతన్య, పరశురాం సినిమా అనుకున్నారు. 14 రీల్స్ నిర్మాణం. ఈ చిత్రానికి ‘నాగేశ్వరరావు’ అనే పేరు కూడా ఖరారు చేశారు. పరశురాం స్టయిల్ లో ఓ ఎంటర్ టైనర్. కథ ఓకే అనుకున్నదశలో .. నాగచైతన్య కొన్ని మార్పులు చేపప్రు. ఈ గ్యాప్ లో మహేష్ సినిమా ఓకే అయ్యింది. సర్కారు వారి పాట యావరేజ్ రిజల్ట్ చూసింది. తర్వాత చైతుకి కొన్ని వెర్షన్ లు వినిపించారు పరశురాం. ఆయనకి నచ్చినట్లు లేదు. వెంకట్ ప్రభుతో ‘కస్టడీ’ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయారు. దీంతో కొనాళ్ళు ఖాళీగా వున్న పరశురాం .. ఇంక వెయిటింగ్ మోడ్ కి స్వస్తి చెప్పి విజయ్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. గీత గోవిందం కాంబినేషన్ కాబట్టి దిల్ రాజు మరో ఆలోచన లేకుండా జై కొట్టారు. ఈ ఈక్వేషన్లు అన్నీ చూస్తుంటే.. ‘నాగేశ్వరరావు’ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.