ENGLISH

SSMB28: మహేష్ సెట్స్ లో... పూజా హెగ్డే

10 December 2022-09:38 AM

మహేష్‌బాబు - త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాలో షూటింగ్ లో పూజా పాల్గొనే డేట్ ఖరారైయింది. డిసెంబర్ 15 నుంచి హైదరాబాద్‌ షెడ్యుల్ షూటింగ్‌లో పూజా హెగ్డే జాయిన్ కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.

 

ఈ చిత్రంలో మరో కథానాయికకీ చోటుందనే సంగతి ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఆ అవకాశం శ్రీలీల సొంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మహేష్ అండ్ టీం మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్ళారు. పాటలు, నేపథ్య సంగీతం విషయంలో అక్కడ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: Pooja Hegde Latest Photoshoot