ENGLISH

Sagar: టాలీవుడ్ లో విషాదం.. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి క‌న్నుమూత‌

02 February 2023-09:04 AM

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకొంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ (70) ఈరోజు ఉద‌యం చెన్నైలో తుది శ్వాస విడిచారు. అమ్మ‌దొంగ‌, రామ‌స‌క్క‌నోడు, స్టువ‌ర్టుపురం దొంగ‌లు లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల్ని అందించారు సాగ‌ర్‌. 1962 మార్చి 1న గుంటూరు జిల్లా నిడ‌మ‌ర్రులో జ‌న్మించారు సాగ‌ర్‌. ఎస్‌.ఎల్‌.సీ పాస్ అయ్యారు.

 

నాయుడు గారి అబ్బాయి, కిరాయి కోటి గాడు లాంటి చిత్రాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. రాకాసి లోయ సినిమాతో ద‌ర్శ‌కుడయ్యారు. ఖైదీ బ్ర‌ద‌ర్స్‌, యాక్ష‌న్ నెంబ‌ర్ 1, అన్వేష‌ణ‌, ఓసి నా మ‌ర‌ద‌లా... ఇలా దాదాపు 30 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కుల సంఘానికి అధ్య‌క్షుడిగానూ ప‌నిచేశారు. వి.వి.వినాయ‌క్‌, శ్రీ‌నువైట్ల‌.. ఈయ‌న శిష్యులే. సాగ‌ర్ మృతి ప‌ట్ల టాలీవుడ్ సంతాపం వ్య‌క్తం చేసింది. ఓ అనుభ‌వ‌శీలిని కోల్పోయామంటూ ద‌ర్శ‌కుల సంఘం సంతాపం ప్ర‌క‌టించింది.