రణ్బీర్ కపూర్ , అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మకంగా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
రామోజీఫిల్మ్ సిటీ ఈ భారీ వేడుకకు వేదిక కానుంది. సెప్టెంబర్ 2న జరగనున్న ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ సినిమా దర్శకుడు రాజమౌళి సమర్పణలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకి రావాల్సిన బజ్ రాలేదు.
ఇప్పుడు ఈ సినిమాకి బజ్ కావాలి. మరి ఎన్టీఆర్ రూపంలో ఈ సినిమాకి ఎంత బజ్ క్రియేట్ అవుతుందో చూడాలి.
ALSO READ: లైగర్ ని మర్చిపోయేలా చేసిన ఆంటీ