ENGLISH

కాజ‌ల్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన తెలుగు మీడియా

04 December 2018-16:30 PM

తెలుగు మీడియా (ప్రింట్‌, వెబ్‌) కాజ‌ల్‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ లాబ్‌లో `క‌వ‌చం` ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేసింది పీ.ఆర్ టీమ్‌. ఉద‌యం ప‌ది గంట‌ల‌కు కాజ‌ల్ ఇంట‌ర్వ్యూల‌కు మీడియాకు ఆహ్వానం అందింది. 10.30 క‌ల్లా.. మీడియా అంతా.. ప్రసాద్ లాబ్‌కి వ‌చ్చేసింది. కాజ‌ల్ మాత్రం రాలేదు.

అప్ప‌టి నుంచి దాదాపు గంట‌న్న‌ర కాజ‌ల్ రాక‌కై మీడియా నిరీక్షించింది. ఎంత‌కీ కాజ‌ల్ రాక‌పోవ‌డంతో.. మీడియా మొత్తం కాజ‌ల్ ఇంట‌ర్వ్యూని బాయ్ కాట్ చేస్తూ.. 11.45 గంట‌ల‌కు అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

స‌రిగ్గా అప్పుడు కాజ‌ల్ ప్ర‌సాద్ లాబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాజ‌ల్‌ని చూసి కూడా మీడియా.. తిరిగి రాలేదు. దాంతో కాజ‌ల్ షాక్‌కి గురైంది. కాజ‌ల్ న‌టించిన `క‌వ‌చం` ఈనెల 7న విడుద‌ల అవుతోంది. అందుకోస‌మే.. ఈ ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేశారు. మీడియా కాజ‌ల్ ఇంట‌ర్వ్యూల‌ను బాయ్ కాట్ చేయ‌డం కాజ‌ల్ కెరీర్‌లోనే తొలిసారి.

ALSO READ: నాగార్జున ఓటు ఏ పార్టీకంటే.. క్లారిటీ ఇచ్చేసాడు..!