ENGLISH

చిరుకి క‌రోనా.. ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌ట‌న‌

26 January 2022-10:18 AM

ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్ట‌ర్‌ ద్వారా వెల్లడించారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, క‌రోనా వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నాన‌ని చిరు ట్వీట్ చేశారు.

 

థర్డ్ వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, చిరు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిన అభిమానులు ..ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. ఇటీవ‌ల `భోళా శంక‌ర్‌` షూటింగ్ లో పాల్గొన్నారు చిరంజీవి. ఇప్పుడు ఆ టీమ్ అంతా ప‌రీక్ష‌లు చేయించుకుంటోంది.

ALSO READ: ఓటీటీలోకే భీమ్లా నాయ‌క్‌!