ENGLISH

చిరు- ప‌వ‌న్‌.... క‌థ ఓకే!

29 May 2017-12:31 PM

చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ల‌సి న‌టించ‌బోతున్నార‌ని, ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారం సాగుతోంది. చిరు,ప‌వ‌న్ ల క‌ల‌యిక ఒట్టి మాటే అనుకొన్నారంతా. కానీ... నిర్మాత సుబ్బిరామిరెడ్డి మాత్రం ఈ కాంబినేష‌న్‌పై సీరియెస్ గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పుడు క‌థ కూడా సిద్ధ‌మైంది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చిరంజీవి, ప‌వ‌న్‌ల కోసం క‌థ సిద్ధ‌మైంద‌ని, చిరు, ప‌వ‌న్‌ల చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఓ కొలిక్కి వ‌చ్చిన త‌ర‌వాత‌... ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద‌ని సుబ్బిరామిరెడ్డి ప్ర‌క‌టించ‌డంతో మెగా ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకొంటున్నారు. చిరు ప్ర‌స్తుతం ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి ప‌నుల్లో ఉన్నారు. ప‌వ‌న్ చేతిలోనూ త్రివిక్ర‌మ్ సినిమా ఉంది. ఈ కాంబినేష‌న్ సెట్ట‌వ్వాలంటే 2018 వ‌ర‌కూ ఆగాల్సిందే.

ALSO READ: సందీప్‌ కిషన్‌తో మిల్కీ సినిమా షురూ