80వ దశకంలో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ప్రముఖ నటీనటులంతా 80’s Group పేరుతో ప్రతియేడు ఒక చోట కలవడం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం.
అయితే ఈ సంవత్సరం ఆ 80’s Group చైనాలో కలిశారు, అక్కడే కొన్ని రోజులు గడిపి తమ పాత జ్ఞాపకాలని నెమరువేసుకున్నారు. ఈ ట్రిప్ తాలుకా ఫొటోస్ ని ఖుష్బు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది.
ఈ ఫొటోస్ లో చిరంజీవి ఆయన భార్య సురేఖ, ఖుష్భు, రాధిక, భాగ్యరాజ్, సుహాసిని, అంబిక తదితర నటులు ఉన్నారు. ఇలా సంవత్సరానికి ఒకసారి కలవడం, హాయిగా కొన్నిరోజులు గడపడం నిజంగా ఒక గ్రేట్ థింగ్ అని ఇది చుసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.
ALSO READ: Qlik Here For More Pics