దర్శకరత్న దాసరి నారాయణరావు అస్తికల నిమ్మజ్జన కార్యక్రమం ముగిసింది.
ఆయన అస్తికలను పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు సమీపంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన పెద్ద కుమారుడైన ప్రభు నిర్వహించారు.
మిగిలిన అస్తికలను కృష్ణ నదిలో అలాగే కాశీలోని గంగలో నిమజ్జనం చేయనున్నారని తెలిసింది. ఆయన ఇక లేరు అనే నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేని ఆయన శిష్యగణం, అభిమానులు బాధలోనే మునిగి ఉన్నారు.
ALSO READ: కాంగ్రెస్ అనుకూల ట్వీట్ చేసిన పవన్