ENGLISH

కమల్ హసన్ పార్టీకి ముహూర్తం పెట్టేశాడు

18 February 2018-15:07 PM

తమిళ స్టార్ హీరో లోక నాయకుడు కమల్ హసన్ రాజకీయ రంగప్రవేశం చేశాక అందులో భాగంగా ఒక ముఖ్య ఘట్టానికి సంబంధించి ముహూర్తం పెట్టేశాడు.

ఆ వివరాల్లోకి వెళితే, ఈ నెల 21వ తేదీన తమిళనాడులోని మదురై దగ్గరలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన రాజకీయ పార్టీని, జెండాని అలాగే ఎజెండాని కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన క్రీయాశీల రాజకీయాలకి సంబంధించి పలు సూచనలు, విమర్శలు చేస్తున్న తరుణంలో ఆయన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఈ సభ ఏర్పాటు చేశారు. 

ఇక త్వరలోనే ప్రజలని విస్తృతంగా కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటూ వాటికీ పరిష్కార మార్గాలని చూపెట్టే వైపుగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగనుంది అని ఆయన అలాగే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

చూద్దాం.. కమల్ హసన్ ఎటువంటి ఆసక్తికర ఎజెండా తో రాబోతున్నారో ప్రజల్లోకి..

 

ALSO READ: ఆర్జీవీ ల్యాప్ టాప్ ని సీజ్ చేసిన పోలీస్ అధికారులు