ENGLISH

ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

26 January 2022-12:00 PM

జాతీయ ఉత్త‌మ న‌టిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్‌. త‌న ఖాతాలో మ‌ర్చిపోలేని విజ‌యాలున్నాయి. అందుకే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే రెండేళ్ల‌నుంచి త‌న ఖాతాలో హిట్టు లేదు. `పెంగ్విన్‌`, `మిస్ ఇండియా`, `అన్నాత్తై`, `మ‌ర‌క్క‌ర్‌`... ఇలా వ‌రుస ఫ్లాపులు మూట‌గ‌ట్టుకుంది. `రంగ్‌దే` కి సైతం డ‌బ్బులు రాలేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్ కిందే లెక్క‌. ఈ వ‌రుస ప‌రాజ‌యాలు కీర్తిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. కీర్తిని ఎంచుకోవాలంటే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కీర్తి నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే `మిస్ ఇండియా`. న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రం ఈనెల 28న విడుద‌ల అవుతోంది.

 

నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు రిలీజ్ డేట్ ప‌క్కా అయ్యింది. కీర్తి న‌టించిన మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఈ సినిమా పైనే న‌టిగాకీర్తి భ‌విత‌వ్యం ఆధార ప‌డి ఉంటుంది. త‌న చేతిలో స‌ర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమా ఉండొచ్చు. ఆ సినిమా హిట్ట‌యితే క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ గా కీర్తి ఇంకొన్ని సినిమాలు ద‌క్కించుకోవ‌చ్చు. కానీ ఫ్యూచ‌ర్‌లో కీర్తితో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ద‌ర్శక నిర్మాత‌లు ముందుకు రావాలంటే మాత్రం... క‌చ్చితంగా `గుడ్ ల‌క్ స‌ఖీ` హిట్టు కావాల్సిందే. క‌నీసం యావ‌రేజ్ గా నిలిచినా.. కీర్తి నిల‌బ‌డుతుంది. ఈ వ‌రుస ప‌రాజ‌యాల‌కు బ్రేక్ ప‌డాలంటే.. అదృష్టం కీర్తిని వ‌రించాల్సిందే.

ALSO READ: చిరుకి క‌రోనా.. ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌ట‌న‌