ENGLISH

ఎన్టీఆర్ ప‌క్క‌న కియారా

14 April 2021-12:00 PM

ప్ర‌స్తుతం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్‌. ఆ త‌ర‌వాత‌.. త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాల్సింది. కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. ఆ స్థానంలో కొర‌టాల శివ‌తో సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. జూన్ రెండో వారంలో షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈలోగా క‌థానాయిక‌ని కూడా ఖ‌రారు చేసేసిన‌ట్టు టాక్. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కైరా అడ్వానీని ఎంపిక చేసిన‌ట్టు భోగ‌ట్టా.

 

మ‌హేష్ - కొర‌టాల భ‌ర‌త్ అనే నేనుతో... టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కైరా. ఆ సినిమా హిట్ట‌యినా స‌రైన అవ‌కాశాలు రాలేదు. ఈమ‌ధ్య కొన్ని ప్రాజెక్టుల‌కు కైరా పేరు అనుకుంటున్నారు కానీ, సెట్ అవ్వ‌డం లేదు. అయితే.. ఎన్టీఆర్ - కొర‌టాల సినిమాకి కైరా దాదాపుగా ఫిక్స్ అని టాక్‌. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

ALSO READ: 'ఆదిపురుష్' రూమ‌ర్ల‌పై స్పందించిన ద‌ర్శ‌కుడు